సీఎం జగన్ ఓ కలుపు మొక్క – మాజీ మంత్రి ఆదినారాయణ

-

వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఈ విషయాన్ని ముందుగానే చెబుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఓ కలుపు మొక్క అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ని బిజేపి కలుపుకునే ప్రసక్తే లేదన్నారు. మాపార్టీ ఈ ప్రభుత్వంపై సీరియస్ గానే ఉందని స్పష్టం చేశారు.

మడకశిరలో మా నాయకుడు కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. నడ్డా, అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిపారు. జగన్ కు బిజెపి అండ లేదు, దండ లేదు.. అండా(గుడ్డు) జాయేగా అంటూ ఎద్దేవా చేశారు. వివేకా కేసులో మా పై ఆరోపణలు చేశారని.. ఈ కేసులో సిబిఐ అసలు నిజాలు తేల్చేసిందని.. వారి శీలం ఏమిటో తెలిపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version