ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన

-

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

CM Jagan’s visit to Uravakonda of Anantapur district today

ఈ మేరకు ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్‌. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ తరుణంలోనే వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version