మంత్రి ఆదిమూలపు సురేష్‌ SC కాదని ఫిర్యాదు !

-

Minister Adimulapu Suresh : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ కు ఊహించిన షాక్‌ తగిలింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ SC కాదని, ఈ అంశంపై విచారణ చేయాలంటూ మార్కాపురానికి చెందిన పీ.ఇమ్మానుయేలు అనే వ్యక్తి ప్రకాశం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

‘సురేష్ పేరెంట్స్ ZP హైస్కూలులో HMలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత BC(C)లుగా క్రిస్టియన్ కోటాలో శ్రీ రాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ ప్రకారం వారి పిల్లలుగా సురేష్ కూడా బీసీ(సీ) కిందకు వస్తారని.. తన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు పీ.ఇమ్మానుయేలు అనే వ్యక్తి. దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వ్యవహారం.. చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version