జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది : చంద్రబాబు

-

జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదు అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా.. సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. జగన్ ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రా.. కదిలి రా.. అని పిలుపిస్తే.. వెంకటగిరి గర్జించింది. జగన్ రాజకీయ వ్యాపారి. మనందరినీ పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.

వైసీపీలో ఉంటూ జగన్ పాలన బాగోలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రజాహితం కోసం మాట్లాడితే ఆయనను దూరం పెట్టేశారు. సీనియర్లను కూడా లెక్కచేయని అహంకారం జగన్ ది. ఈ సీఎం వెయ్యి తప్పులు చేశారు. ఇంకా భరిస్తారా..? జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా..? 25 ఏళ్ల క్రితం యువతకు ఐటీ అనే ఆయుధం ఇచ్చానని.. అదే ఇప్పుడు వజ్రాయుధం అయిందన్నారు. టీడీపీ హయాంలో తిరుపతిని మొబైల్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని కోరారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version