నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా – సీఎం జగన్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు, దత్తపుత్రుడు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటారని విమర్శించారు. వీరికి ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి ప్రేమ లేదన్నారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూబ్లీహిల్స్ లో ప్యాలెస్ కట్టుకున్నాడని.. మన రాష్ట్రంలో దోచుకుని హైదరాబాద్లో నివాసం ఉండడమే దత్తపుత్రుడు, దత్త తండ్రి సిద్ధాంతం అని దుయ్యబట్టారు. ఈ నాయకులకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా కూడా లేదన్నారు. మైదానంలో బహిరంగ సభలు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయని చంద్రబాబు ధైర్యం చేయడం లేదని.. అందుకే ఇరుకు సందుల్లో, బొందుల్లో మీటింగ్ లు పెడుతున్నారని మండిపడ్డారు. మనుషులు చనిపోతే కనీసం సానుభూతి కూడా చూపడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version