ఏనుగుల దాడిలో మృతి చెందిన యాకోబు కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

-

ఏనుగుల దాడిలో మృతి చెందిన యాకోబు కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు పార్వ‌తీపురం ఎమ్మెల్యే బోనెల విజ‌య్ చంద్ర‌. ఏనుగుల దాడిలో మృతి చెందిన యాకోబు కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియానను ఇవాళ ఉద‌యం అంద‌జేస్తాన‌ని ప్ర‌క‌టించారు పార్వ‌తీపురం ఎమ్మెల్యే బోనెల విజ‌య్ చంద్ర‌.

Ex-gratia of Rs.10 lakhs to the family of Jacob who died in an elephant attack

ఏనుగులు సంచ‌రిస్తున్న ప్ర‌దేశాల‌కు ప్ర‌జ‌లు వెళ్ళొద్ద‌ని కోరారు విజ‌య్ చంద్ర‌. ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందిస్తుందని హామీ ఇచ్చారు పార్వ‌తీపురం ఎమ్మెల్యే బోనెల విజ‌య్ చంద్ర‌. కాగా ఏపీలోని పార్వతీపురం మండలం పెద్దబొండపల్లిలో దేవాబత్తుల యాకోబును ఏనుగుల గుంపు చంపేసాయి. పొలం ప‌నులు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఏనుగులు దాడి చేశాయి. ఇటీవ‌లి కాలంలో ఏనుగుల దాడిలో యాకోబు స‌హా న‌లుగురు మృతి చెందారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు పార్వతీపురం రూరల్ ఎస్సై సంతోష్‌కుమార్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version