FLASH : మాజీ మంత్రికి కరోనా.. టీడీపీ లో టెన్షన్..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తనకు కరోనా సోకిందని.. కరోనాను జయించి మళ్ళీ మీ ముందుకు వస్తానని పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు.

అలాగే గత వారంలో రోజుల్లో తనని కలిసిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆయన కరోనా నుంచి కోలుకుని క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version