సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ స‌భ్యులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ను దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు కలిశారు. సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీఎం జగన్ తో పంచుకున్నారు సిరివెన్నెల కుటుంబ సభ్యులు.


కాగా, సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్.. ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసింది. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌. సీఎంని కలిసిన వారిలో సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version