విజయవాడను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ – గద్ద రామ్మోహన్

-

విజయవాడను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్ రావు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సజ్జల అంటున్నారు… కృష్ణానది రిటైనింగ్ వాల్ గురించి పచ్చి అబద్దాలు సజ్జల చెబుతున్నారని అగ్రహించారు.

వరదల నుండి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని గతంలో అనేక ధర్నాలు, ఆందోళన చేసాం..జల దీక్షలు చేశానని పేర్కొన్నారు గద్దె రామ్ మోహన్ రావు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కరకట్ట రిటైనింగ్ వాల్ నిర్మాణం పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు…మూడు పార్ట్ లుగా 5కీమీ లు మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని అప్పుడే చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం మేమే చేసామని సజ్జల సిగ్గు చేటు..అక్కడి ప్రజలను అడిగితే ఎవరు ప్రారంభించారో చెప్తారన్నారు గద్దె రామ్ మోహన్ రావు. అసెంబ్లీలో స్పీకర్ మా గొంతు నొక్కు తున్నారు…వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు గద్దె రామ్ మోహన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version