ఏపీ మందుబాబులకు శుభవార్త..అక్టోబర్ 1 నుంచి తక్కువ ధరకే మద్యం !

-

Good news for drug addicts of AP: ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. మొన్నటి వరకు అమలులో ఉన్న మద్యం పాలసీని రద్దుచేసి కొత్త మద్యం పాలసీని తీసుకురానుంది చంద్రబాబు నాయుడు సర్కార్. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ రెడీ కానుందట. ఈ మేరకు ఏపీ మంత్రి పార్థసారథి స్పష్టమైన ప్రకటన చేశారు. కేమినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన..మీడియాకు వెల్లడించడం జరిగింది.

Good news for drug addicts of AP

ఇక కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి.. నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే… మంచి నాణ్యమైన మధ్యాన్ని ఏపీ మందుబాబులకు అందిస్తామని తెలిపారు ఏపీ మంత్రి పార్థసారధి. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. తమకు నచ్చిన మందులు అమ్మి మందు బాబులకు అన్యాయం చేశారని… వాళ్ల కుటుంబాలతో ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. కానీ తమ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version