కల్లు తాగిన కోతిలా జగన్ వ్యవహరిస్తున్నాడు – గోరంట్ల బుచ్చయ్య

-

కల్లు తాగిన కోతిలా జగన్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. రేపు రాత్రి నుంచి లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.

డీ జీ పీ , పొన్నవోలు విచారణ లో ఉండగా డిసైడ్ చేయడానికి ఎవడు హక్కు ఇచ్చాడని..కేసులు తో వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెడుతున్నారు..అవి నిలబడవన్నారు. కల్లు తాగిన కోతిలా జగన్ వ్యవహరిస్తున్నాడని… రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు సిద్ధం అయిపోయిందని వెల్లడించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలవడం ఖాయమైందని.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తో మా పార్టీకి బలం పెరిగిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.

Read more RELATED
Recommended to you

Latest news