జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఆర్టీసీలు కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ కారుణ్య నియామకాలను గ్రామా మరియు వార్డు సచివాలయాలు, ఆర్టీసీ అలాగే జిల్లా కలెక్టర్ల పూల్ కింద చేపడతారని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

మంగళవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు ఈమెరకు ఉత్తరం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వేయడానికి ముందు సర్వీస్ లో 896 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కారుణ్య నియామకలకు సంబంధించిన విషయాన్ని ఎన్‌ఎంయూ, ఈయూ, వైఎస్సార్‌ పీటీడీ అసోషియేషన్, ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌ నేతలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. 2016 నుంచి పెండింగ్‌ లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కారుణ్య నియామకాల జాబితానను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ఆ తర్వాత ఈ లిస్ట్‌ ఫైనల్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version