మద్యం తాగాలంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతాం – గుడివాడ అమర్‌నాథ్‌

-

మద్యం తాగాలంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతామని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా బార్ల సంఖ్యను పెంచలేదని.. పాత బార్లకు లైసెన్సుల గడువు పూర్తయినందుకు తిరిగి కొత్తగా ఇస్తున్నామని వెల్లడించారు. బార్, రెస్టారెంట్, హోటల్స్‌లో మద్యం ధరలు పెంచుతాం. అప్పుడు డబ్బున్న వారే మద్యం తాగుతారన్నారు.

మద్యం తాగాలంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతాం అని చెప్పాం. అదే పని చేశామని స్పష్టం చేశారు గుడివాడ అమర్‌నాథ్‌. మద్యపాన నిషేధం అనే మాటే తమ మేనిఫేస్టోలో లేదు అన్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఏపీలో మద్యం ధరను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకువెళ్తామని చెప్పామని.. అదే చేస్తున్నామని అన్నారు. ఎవరైనా తాగాలంటే షాక్ కొట్టేట్టుగా ధరలను చేస్తామని తమ అధినేత చెప్పారని తెలిపారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా తమ మేనిఫెస్టో గోడలపై ఉంటుందని.. వెళ్లి చూసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version