చంద్రబాబు కళ్ళతో చూస్తే అన్నీ తప్పుగానే కనిపిస్తాయి – మంత్రి అమర్నాథ్

-

కుప్పం నియోజకవర్గం పర్యటనలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. వైజాగ్ లో నేటి పరిస్థితులకు ఉదాహరణ అని అన్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎంపీ కుటుంబ సభ్యుల నిర్బంధం వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడం అనేది ఏమీ ఉండదని అన్నారు.

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో కాన్టెక్ ఎక్స్ఫో ను ప్రారంభించారు మంత్రి అమర్నాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కళ్ళతో చూస్తే అన్నీ తప్పుగానే కనిపిస్తాయని అన్నారు. పోలీసులకు ఎప్పుడు సమాచారం అందింది, వారు ఎలా స్పందించారనేదే చూడాలన్నారు. పోలీసు వ్యవస్థ సరిగా స్పందించిందా..? లేదా..? అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version