నిరుద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

-

Indian Army Recruitment Rally 2024: ఏపీ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. అగ్ని వీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం నుంచి భారీ ఆర్మీ ర్యాలీ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పరీక్షలు నిర్వహించబోతుంది మోడీ ప్రభుత్వం. పదో తరగతి ఉత్తీర్ణతలతో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారు ఈ… ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారు.

Indian Army Recruitment Rally 2024

ఇందులో అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్ డ్యూటీ ఉన్నాయి. అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ పదవ తరగతి ఉత్తీర్ణతతో రానున్నాయి. ఇక ఎనిమిదో తరగతి పాస్ అయిన వారికి అగ్ని వీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి విశాఖకు చేరుకున్న అభ్యర్థులు… ఇవాళ ర్యాలీలో పాల్గొంటారు. ఇందులో 13 జిల్లాలకు చెందిన యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version