షర్మిళ మీద పోస్టర్లు వేసిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : వీహెచ్

-

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజు కి దిగజారి పోతుందని  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వీహెచ్ పేర్కొన్నారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  షర్మిళ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యినప్పటి నుండి, ycp నాయకులు మతి లేకుండా మాట్లాడుతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. అందుకే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.షర్మిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని ycp నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఆమె మీద పోస్టర్లు వేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసింది అని.. జగన్ కు నీతి, నిజాయితీ లేదు అన్నారు. సొంత చెల్లెలు పై కామెంట్స్  చేస్తుంటే జగన్ మాట్లాడటం లేదన్నారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్ర మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్యాయం చేసిండు కాబట్టే షర్మిళ న్యాయం చేయడానికి ఆంద్రప్రదేశ్ వచ్చింది. సొంత బాబాయి బిడ్డ సునీతను చంపుతానని బెదిరిస్తున్నారు.. అయినా జగన్ సప్పుడు జెయ్యట్లేదు. షర్మిళ మీద పోస్టర్లు వేసిన వ్యక్తుల పై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. వచ్చే  ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు వీ.హెచ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version