ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి : మోడీకి ఏపీ సీఎం లేఖ !

-

ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. దాదాపు నలభై వేలకు పైగా పాటలు పాడి గాన గంధర్వుడనే పేరును సార్ధకం చేసుకున్న ఎస్పీ బాలు కరోనా బారిన పడిన అనంతరం దాదాపు నెలన్నర రోజులు చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని హీరో అర్జున్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయం మీద ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.

బాల సుబ్రమణ్యం భారత రత్న అవార్డ్ కు అర్హుడని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని జగన్ లేఖలో కోరారు. అయితే ఇప్పటికే బాల సుబ్రమణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మభూషణ్ సత్కారాలు పురస్కరించింది. 2001 లో పద్మ శ్రీ పురస్కారం అలానే 2011లో పద్మభూషణ్ ఈయన్ని వరించాయి. భారతరత్న కూడా ఇవ్వాలంటూ ఇప్పుడు అభిమానుల నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏపీ సీఎం కూడా లేఖ రాయడంతో ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version