తూర్ఫుగోదావరి వైసీపీలో ముసలం..ఎంపీ భరత్‌ పై జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

-

తూర్ఫుగోదావరి వైసీపీలో ముసలం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యువజన సంఘం కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో వన్ టైం ప్రజాప్రతినిధి అంటూ పరోక్షంగా ఎంపీ భరత్ పై కామెంట్ చేశారు. వైసీపీ పార్టీలో గుండాలు, రౌడీలను ప్రోత్సహించారని.. నేను ఓ కులాన్ని దూషించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు జక్కంపూడి గణేష్.

నా తండ్రి అనుచారులంతా శెట్టిబలిజ కులస్థులేనని.. ఆ ప్రజాప్రతినిధి వారి కులం వారే బుద్ది చెప్పారని అనుకుంటానని వివరించారు. అందుకే ఆ వివాదంలో తగ్గారని అనుకుంటున్నానని..తెలుగుదేశం నాయకులు తమను అప్రతిష్ఠ పాల్జేసేలా వారి పార్టీ పత్రికలో వక్రికరించి వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి బలమైన నియోజక వర్గాల్లో వైసీపీ నేతల మనోస్తైర్యం దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు… నామీద, నా సోదరుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్ట్టు, ఆస్తులు అంతస్తులు సంపాదిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు జక్కంపూడి గణేష్. ఈ నెల 6న దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతి వేడుకలు రాజమండ్రి లో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news