జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్

-

జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న తరుణంలో ఆ పార్టీ నేతలకు, శ్రేణులకు పవన్ కళ్యాణ్ నేడు కీలక సూచన చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని, అందులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. దృష్టి మళ్లించడానికి, భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని.. వాటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉందని తెలిపారు.

అలాగే మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ వాస్తవాలు నిర్ధారించుకోవాలన్నారు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయవద్దని.. అవి పార్టీకి, సమాజానికి మంచివి కావన్నారు. జనసేనతో కొన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని, జనసేన పట్ల ఆయా పార్టీలకు ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని జనసేన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం ఉందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. అందువల్ల జనసేన పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version