బ్రేకింగ్ : గాంధీ ఆసుపత్రికి వైఎస్ షర్మిల !

-

తెలంగాణలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపుతోంది. తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కు మరియు తెలంగాణ పోలీసులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది. షర్మిల మరియు ఎస్ ఐ ల మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరగడంతో షర్మిల ఎస్ఐ పై చేయి చేసుకుంది, దీనితో ఆగ్రహించిన పోలీసుల బృందం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో షర్మిల పై ఐపీసీ సెక్షన్ 323 , 353 , 509 , 427 ల కింద నమోదు చేసారు.

కాగా ఇక ఆమెను నాంపల్లి కోర్టుకు తరలిస్తారు అనుకునే లోపు.. ఆరోగ్యం కొంచెం బాగుండకపోవడంతో వైశ్య పరీక్షలు చేయించాలన్న కారణంతో షర్మిలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈమెకు పరీక్షలు చేసిన అనంతరం ఆమెను నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాగా ఈమెను కోర్ట్ లో హాజరు పరిస్తే… మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version