చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్

-

బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షో సందర్భంగా తొక్కి సలాట చోటు చేసుకుని ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేడు ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతుంది. ఇదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్స్ లో పెట్టుకోవలసిన సభ రోడ్డు మీదకు రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు.

అంతేకాకుండా చంద్రబాబుపై కందుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ఆరోపించారు కేఏ పాల్. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కందుకూరులోని ఘటనస్థలిని కూడా సందర్శించారు కే ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version