ప్రజా శాంతిలో చేరితే… పవన్ కళ్యాణ్‌ ను సీఎం చేస్తా – కేఏ పాల్‌

-

ప్రజా శాంతిలో చేరితే… పవన్ కళ్యాణ్‌ ను సీఎం చేస్తానని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు కేఏ పాల్‌. పవన్ కళ్యాణ్‌ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్న ఎంత డబ్బు కావాలన్నారు. వైసిపి సిద్ధం అంటుంది…టిడిపి – జన సేన దోచుకోవడానికి సంసిద్ధం అంటుందని విమర్శలు చేశారు. ప్రజల రక్షణ కోసం ప్రజా శాంతి పార్టీ, కే ఏ పాల్ ఆత్మీయ యుద్ధం అంటున్నారు….ఇక ప్రజలు తేల్చుకోవాలని కోరారు.

ka paul

వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా చనిపోతాడు అని చెప్పాను… అదే జరిగింది….కేసీఆర్ చిత్తు గా ఓడిపోతారు అని చెప్పాను… అదే జరిగిందని చెప్పుకొచ్చారు కేఏ పాల్‌.ఇప్పుడు దేశంలో రూపాయి విలువ పడిపోయింది..మోడీ ప్రభుత్వం వచ్చాక నెలకు లక్షా పదివేల కోట్లుకు అప్పు చేరిందని ఫైర్‌ అయ్యారు. మోడీ తోత్తులు అయిన టీడీపీ, జన సేన పార్టీలను నమ్మవద్దని కోరారు కేఏ పాల్. కాపులు… జన సేన, టీడీపి పొత్తునున వ్యతిరేకిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ – చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలో బాధ కనపడిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version