గుండు కొట్టించుకున్న పవన్ కావాలా? గుండుగీసే ఈ కాపు కావాలా? : కేఏ పాల్

-

 

గుండు కొట్టించుకున్న పవన్ కావాలా? గుండుగీసే ఈ కాపు కావాలా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ సంచలన వాక్యాలు చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. కాపులంతా తనవైపు రావాలని కోరారు. రాష్ట్రంలో 29 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

అయితే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ లాంటి కాపు నాయకులతో అది సాధ్యం కాదని కేఏ పాల్ అన్నారు. ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.1000 కోట్లకు కాపులను టిడిపికి అమ్మేశాడని పాల్ ఆరోపించారు. అలాగే టీడీపీతో పొత్తు నాటకం ఆడుతూ 30 సీట్లను రూ. 1500 కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. 2009లో తన అన్న చిరంజీవి కాపులను నిలువునా ముంచేసారని…. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చేస్తున్నాడని కేఏ పాల్ అన్నారు. రంగా ఆశయాలను సాధించాలనుకునే కాపులు ఎవరు టిడిపితో గాని…. దాంతో జతకట్టిన జనసేనతో గాని ఉండరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version