మహానాడులో బాలయ్య ఫోటో ఎందుకు పెట్టలేదు – కొడాలి నాని

-

తెలుగు దేశం పార్టీ మహానాడుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదని.. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారని నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారని.. పనికి మాలిన వెధవల్ని తెచ్చుకుని మిమ్మల్ని బండబూతులు తిట్టించటం.. ఇంద్రుడు చంద్రుడు అని చంద్రబాబును పొగిడించుకోవడం అన్నారు.

చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా?? బాలకృష్ణ ఫోటో వేదిక మీద ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు కొడాలి నాని. అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారుగా… లోకేష్ పాదయాత్రకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న తారక్ ఫోటో ఎందుకు పెట్టలేదు?? అని నిలదీశారు. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టిన ఫోటోలు కూడా ఉండవా?? అని నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version