చంద్రబాబుతో కలిసి రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారారు – లక్ష్మీపార్వతి

-

శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభలో దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసిపి నేత లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రజనీకాంత్ కి లేదన్నారు. చంద్రబాబుతో కలిసి రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారారని ఆరోపించారు.

Lakshmi-Parvati

నాడు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వాళ్లలో రజనీకాంత్ కూడా ఉన్నాడని వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ నీ కలిసి రజనీకాంత్ తాను తప్పు చేశానని క్షమాపణ కోరారు అని వివరించారు. ఎన్టీఆర్ చివరి రోజులలో మాట్లాడిన మాటలు రజనీ తెలుసుకోవాలని సూచించారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version