వైసీపీ నుంచి టిడిపిలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు : అచ్చెన్నాయుడు

-

జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టిడిపిలో చేరేందుకు చాలామంది నాయకులు, కార్యకర్తలు ఉవ్విళ్ళూరుతున్నారని అన్నారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరే హక్కు ఉందని అన్నారు. కానీ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని వైసీపీ నుంచి టిడిపిలో చేరుతున్నారని తెలిపారు.

పార్టీ మారిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలన సొంత పార్టీ నేతలకు నచ్చట్లేదు అని అందుకే టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. రాజంపేట పార్లమెంట్ వైసీపీ రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్ది తెలుగుదేశం పార్టీలో చేరారని.. అప్పటి నుంచి వైసీపీ నేతలు కొండ్రెడ్ది పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. పార్టీ మారితే కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version