ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. ఎంటెక్, ఎం.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌. ఎంటెక్, ఎం.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు తిరుపతిలోని వెంకటేశ్వర వర్సిటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది.

గేట్, జిపాట్ లో నిర్దేశించిన స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 9-11 సర్టిఫికెట్లు అప్లోడ్, 15-17 వెబ్ ఆప్షన్లు, 22న సీట్లు కేటాయించనుంది. ఈనెల 26 నుంచి PG సెట్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.

ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోయినా పలు జిల్లాల్లో భారీ వానలకు అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version