టీడీపీ ట్వీట్ పై మంత్రి రోజా ఫైర్

-

టిడిపి ట్వీట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పర్యాటక శాఖ మంత్రి రోజా. మంత్రి పదవులను జనం కోసం కాకుండా జగన్ కోసం, తమ స్వార్థం కోసం వాడుతున్నారని టిడిపి చేసిన ట్వీట్ పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

“జగన్ ఇచ్చిన మంత్రి పదవులను జనం కోసం కాకుండా ఆ అధికారాన్ని జగన్ కోసం.. తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు వీళ్ళు. అందుకే చంద్రబాబు గారు ఈ రేంజ్ లో తగులుకున్నారు. ఆయన చెప్పింది విన్నాక నిజమే కదా అంటున్నారు ప్రజలు” అని టిడిపి ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి రోజా..

” చివరికి ఇలా ఫేక్ ప్రచారానికి దిగారా మీ టిడిపి అంతా? అసలు మీ చంద్రబాబు ప్రభుత్వంలో టూరిజం శాఖ ఒకటి ఉండేదని కానీ, టూరిజం మంత్రి ఉండేవారని కానీ ప్రజలకు తెలియనట్లు ఉండేది. కానీ మా సీఎం జగన్ గారి ప్రభుత్వంలో ఏపీని టూరిజం హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ లో టూరిజం రంగంలో రూ. 22, 096 కోట్ల విలువైన 117 ఎంఓయూలు జరిగాయి. ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఏపీలో టెంపుల్ టూరిజం వంటి నూతన విధానాలు ప్రవేశపెడుతున్నాం. చారిత్రాత్మక స్థలాలను టూరిజం కేంద్రాలుగా మారుస్తున్నాం” అని ట్వీట్ చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version