ఏవీ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

-

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీ కి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీగోడను తొలగించిన కేసులో ఏ3గా దానం నాగేందర్ పై కేసు నమోదు అయింది. హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన దానం.. తనపై నమోదైన కేసు పై స్పందించారు. 

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ అధికారులు వస్తుంటారు. పోతుంటారు. నేను లోకల్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్టుంది. అందుకే నాపై కేసు పెట్టారంటూ కామెంట్స్ చేశారు. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికీ వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. జరిగిన విషయాన్ని ఐపీఎస్ రంగనాథ్ దృష్టికీ తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version