175 కు 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తాం – ఎమ్మెల్యే రవీంద్ర

-

MLA Rabindranath Reddy: 175 కు 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తామని తెలిపారు ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి మాట్లాడుతూ….ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నాఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. ఈ సారి 75 శాతం ఓట్లతో తిరిగి అధికారంలోకి వస్తాం…బీజేపీ తో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడిందని చురకలు అంటించారు.

 

MLA Rabindranath Reddy on tdp

సింహం సింగిల్ గా వస్తుంది అనేలా జగన్ సింగిల్ గా మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి. 14 ఏళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు చేసిన మంచి ఏంటి.. అంటూ ఫైర్‌ అయ్యారు. కరువును తోడుగా తెచ్చి వర్షాలు లేక రైతులు, ప్రజలను ఇబ్బందులు పడ్దారన్నారు. కాలర్ ఎగరేసి చెప్పే దమ్ము ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే…175 కి 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version