జగన్‌ కు మరో షాక్‌..వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు

-

సీఎం జగన్‌ కు మరో షాక్‌ తగిలింది. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ ను తప్పబట్టారు వసంత కృష్ణ ప్రసాద్‌. ఇటీవల జరిగిన గుంటూరు ఘటన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడు అని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు.  ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని తెలిపారు. ప్రజలకు నష్టం కలిగించాలని ఉయ్యూరు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని తాను అనుకోవడంలేదని వసంత కృష్ణప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టే శ్రీనివాస్ పై వివాదాలు వచ్చాయని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version