AP: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఎంపీడీవో మిస్సింగ్ కేసు

-

MPDO Missing Case: ఏపీలో ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ కేసు ఇంకా సస్పెన్షన్‌ గానే ఉంది. ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నా ఎంపీడీవో ఆచూకీ మాత్రం దొరుకలేదు. వెంకటరమణ ఏలూరు కాల్వలో దూకి సూసైడ్ చేసుకున్నాడా లేదా తెలియక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఏలూరు కాల్వలో దూకాడనే అనుమానంతో 4 రోజులుగా NDRF, SDRF బృందాలతో గాలింపు చేస్తున్నారు పోలీసులు.

MPDO Missing Case

గన్నవరం నుంచి కేసరపల్లి వరకు 50 మందితో 6 డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎంపీడీవో ఫోన్ GPRS , IPDR (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్) సమాచారం సేకరిస్తున్నారు ఏపీ పోలీసులు. వేరే ప్రదేశాల్లో ఎక్కడైనా సంచరించి ఉంటాడేమో అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. మొబైల్ సిగ్నల్ చివరగా గుర్తించిన చోటు నుంచి అంతర్గత రోడ్లలో, బస్టాండ్, రైల్వే స్టేషన్ లో సీసీ టీవీలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version