ఏపీని చూసి ప్రపంచం నవ్వుతోంది : నందమూరి బాలకృష్ణ

-

ప్రపంచ పటంలో ఏపీ కనిపించకుండా పోతోందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న దుస్థితిని చూసి ప్రపంచం నవ్వుకుంటోందన్నారు. జగన్ పాలనలో ఏపీ అన్నిరకాలుగా నష్టపోయిందని చెప్పారు. కక్ష సాధింపులే జగన్ లక్ష్యమని తెలిపారు. అలాంటి రాక్షస పాలకుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులతో పాటు ప్రజలకు కూడా ఉందని పేర్కొన్నారు బాలయ్య.

అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు జగన్. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర పన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్… అధికారులే అమలు చేస్తారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారు.

సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా జగన్‌ పనిచేస్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని తెలిపారు. అవీనితి జరిగితే ఆధారాలు చూపించాలి కదా అని ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదని నిలదీశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని బాలయ్య మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version