మోడీ ప్రభుత్వంతో…. ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తాను – పవన్ వార్నింగ్

-

మోడీ ప్రభుత్వంతో…. ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నిన్న విశాఖ జగదాంబ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. కేంద్రం తో ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తాను.. సమీప భవిషత్తు లో అన్ని బయటకు వస్తాయని హెచ్చరించారు.

ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయము గా మార్చారని ఫైర్‌ అయ్యారు. ఏయూ లో వైసీపీ నాయకులు పుట్టిన రోజులు చేస్తారు…గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు పవన్‌ కళ్యాణ్‌. ప్రొద్దునే పథకం కింద డబ్బులు ఇస్తారని, సాయంత్రం సారా కింద డబ్బులు లాగేసుకుంటుంది ఈ ప్రభుత్వమని ఆయన విమర్శలు గుప్పించారు. గుండాలు, రియల్ ఎస్టేట్ రాబందులు చేతులులో విశాఖ ఇరుక్కుపోయిందని, గుండాలు తోలు తీయడానికి పవన్ కల్యాణ్ మీ కోసం ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version