పవన్ కళ్యాణ్. ఆశయాలు, సిద్దాంతాలు నచ్చే జనసేనలో చేరాను : జానీ మాస్టర్

-

పవన్ కళ్యాణ్. ఆశయాలు..సామాజిక న్యాయం. సిద్ధాంతాలు నచ్చే జనసేన లో చేరాను అని జనసేన నేత జానీ మాస్టర్ తెలిపారు. తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశలను సాధించేందుకు ఒక భాగం కావాలని అనుకున్నానని తెలిపారు. నెల్లూరులోని సమస్యల పై పోరాటం చేస్తానని తెలిపారు. వెంకటేశ్వర పురంలో టిడ్కో కింద 4 వేలకు పైగా గృహాలను నిర్మించారు.

ఐదేళ్లయినా లబ్దిదారులందరికీ ఇళ్లు ఇవ్వలేదు అన్నారు. వాళ్లకు ఇచ్చే వరకూ పోరాటం చేస్తానని తెలిపారు. ఈ నెల 10న టిడ్కో ఇళ్ల వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నా చేస్తానన్నారు. ఆ ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు. పదవులు ఆశించి జన సేనలో చేరలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ ఏమి చెబితే అది చేస్తానన్నారు. పోటీ చేయమన్నా రెడీ…లేదా పార్టీ పని చేయమన్నా సిద్ధం అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తామని తెలిపారు జనసేన నేత జానీ మాస్టర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version