దేనికి ఈ గర్జనలు.. జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు

-

జగన్‌ సర్కార్‌ పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నల వర్షం కురిపించాడు. దేనికి ఈ గర్జనలు? అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయాడు పవన్‌ కళ్యాణ్‌. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా? ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? అని ఆగ్రహించారు.

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా? దేనికి గర్జనలు ? అని నిలదీశారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ చేయనందుకా? విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా.. దేనికి గర్జనలు? అని ప్రశ్నించారు. అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా? అని నిప్పులు చెరిగారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version