అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు పవన్ కళ్యాణ్

-

ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతికి చేరుకున్నారు. మొదట గన్నవరం విమానాశ్రయం నుండి రేణిగుంటకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడినుండి కాలినడకన పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి వెళుతున్నారు.

అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ కళ్యాణ్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం. అలాగే అక్టోబర్ మూడున తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి విజయవాడ తిరుగు పయనమవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version