2024లో కూడా ఒంటరిగా పోటీ చేస్తాం -పెద్దిరెడ్డి

-

2024లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొత్తులు చూసి భయపడే అవసరం వైసీపీకి లేదు.. 2024లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. మాకు ఎవరు కలిసి పోటీ చేసినా వచ్చే ఇబ్బంది లేదు.. పవన్‌ గెలుస్తారో లేదో ఆలోచన చేసుకోవాలని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు అనంతపూర్ లోని రూరల్ నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలసి వచ్చినా తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుంటే చూసి వైసిపి పార్టీ భయపడే అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version