ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని.. విశాఖపట్నంలో చాలా అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీపడ్డారు. లక్ష్మీనరసింహస్వామి ప్రతీక ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. అయితే తానే ముందు ఇస్తానంటూ.. చంద్రబాబు కాస్త ఆసక్తి చూపించారు.
ఇక అటు ఈ కార్యక్రమము అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనాలు రచ్చ చేశారు. యోగ కోసం ఏర్పాటుచేసిన మ్యాట్లను ఎత్తుకెళ్లారు. ఇంటిదగ్గర యోగా చేసుకోవచ్చని లేదా ఎవరికైనా అమ్మవచ్చని… విశాఖ తీరాన ఉన్న యోగ మ్యాట్లను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లిన ప్రజలు https://t.co/1dGhV2cmq2 pic.twitter.com/UQQrWyP7NU
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025