వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది – చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులన్ని తామే ప్రారంభించామని అన్నారు. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు శ్రీశైలంలో ఉంచాలని అనుకున్నామని తెలిపారు.

నాగావలి, వంశధార అనుసంధానం చేయాలనేది తమ ఆలోచన అన్నారు. సాగునీటి రంగంలో వైసిపి ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు చంద్రబాబు. వైసీపీ రాజకీయాల్లో విలువలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రాయలసీమ తరహా ఫ్యాక్షన్ హెచ్చరిల్లుతోందని.. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version