చెల్లని ఓటు చెల్లదు అని గట్టిగా చెప్పాలి – కార్యకర్తలకు సజ్జల ఆదేశాలు

-

చెల్లని ఓటు చెల్లదు అని గట్టిగా చెప్పాలని కార్యకర్తలకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు అనుసరించలిసిన అంశాలపై 175 నియోజకవర్గల కౌంటింగ్ ఏజెంట్ లకు సజ్జల దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు…EC, NDA కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుంది అందరికీ తెలుసు అన్నారు.

Prepared guidelines for Counting Agents of 175 constituencies on matters to be followed on the day of counting

ప్రజా తీర్పు వైసీపీ కు అనుకులంగా ఉంది..పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలని పేర్కొన్నారు. వైసీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు వైసిపికి చెందాలి….చెల్లని ఓటు చెల్లదు అని …గట్టిగా చెప్పాలని ఆదేశించారు. అవతల పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే గట్టిగా నిలదీయాలి…..కచ్చితంగా నియమాలను ఫాలో అవ్వాలని కోరారు.

అవసరం అయితే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయాడానికి అయినా సిద్ధంగా ఉండాలి….అన్ని అంశాలుపై పూర్తి అవగాహన తో కౌంటింగ్ ఏజెంట్ లు ఉండాలని వెల్లడించారు. తెలియని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి,,,ఇప్పటి వరకు ఎంత సీరియస్ గా వున్నామో కౌంటింగ్ రోజు అంత కన్న సీరియస్ గా అందరు అలర్ట్ గా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version