Telangana: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య…మిస్టరీగా మారిన కేసు !

-

 

ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని మరణించింది. అయితే అది ఆత్మహత్య? లేక హత్య? అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో మానస అనే డిగ్రీ విద్యార్థిని నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించింది.

it employees died in tamilnadu

ఉరి వేసుకున్న పరిస్థితుల మధ్య మానస కనిపించడం అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాములు ఉరివేసుకున్న సమయంలో అక్కడే ఉండడం కుటుంబ సభ్యులకు అనుమానాలకు తావిచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీస్తే తనకు ఫోన్లు చేసే వాడినని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది.

రాములు.. మానసను రెండో వివాహం చేసుకునేందుకు వేధించడం పట్ల మానస తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పట్టణ సిఐ ప్రతాప్ లింగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అదేవిధంగా మృతి పట్ల అనుమానాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో అనుమానాలు ఉండడంతో మెరుగైన నివేదిక కోసం ఉస్మానియాకు తరలించినట్లు బాధితులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version