సీఎం జగన్‌ పై దాడి…పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు !

-

సీఎం జగన్‌ పై దాడి…పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. ఇది హేయమైన చర్య అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అని తెలిపారు.

purandeshwari

అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని కోరారు.అంబేద్కర్ ఆశయ సాధనకు జనసేన టిడిపి బిజెపి కూటమి కట్టుబడి ఉందని.. మా పార్టీల ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో కూటమిగా ఏర్పడ్డామన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని.. అంబేద్కర్ సంబంధించిన జ్ఞాపకాలను, ఆనవాళ్లను భారతీయ జనతా పార్టీ పరిరక్షిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు విలువలు లేవు….రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version