జగన్ ప్రభుత్వానికి చిరంజీవి గడ్డి పెట్టారు – రఘురామ

-

జగన్ ప్రభుత్వానికి చిరంజీవి గడ్డి పెట్టారని ఫైర్ అయ్యారు రఘురామకృష్ణ రాజు. మెగాస్టార్ చిరంజీవి గారు తన మనసులోని మాటను చెప్పారని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాంతంలో వరదలు వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే వారిని పరామర్శించాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు, అక్కడకు వెళ్లకుండా బ్రో చిత్రంపై ఫిర్యాదు కోసమని ఢిల్లీకి వెళ్లడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం, పోలవరం నిర్మాణానికి నిధులు, విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ప్రయత్నించాలని, ఉన్న ఆస్తులు అమ్మకుండా చూసుకొమ్మని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టారన్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 52 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, ఎత్తిన అప్పులలో పదివేల కోట్ల రూపాయలు పోలవరం రిహాబిలిటేషన్ కోసం ఖర్చు చేసి ఉంటే, ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తి అయి ఉండేదని, బ్యారేజీ కింద నీళ్లు వచ్చి ఉండేవని అన్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ అని మనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version