50 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదు అయింది : సీఎం చంద్రబాబు

-

50 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదు అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులు చేయాలో అన్ని చేసింది. మా ప్రబుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. ప్రతీ విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే విజయవాడ ఇవాళ ముంపునకు గురైందని తెలిపారు.

కురిసిన వర్షాలకు భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. వరద బాధితులకు బియ్యంతో పాటు ఇతర నిత్యవసర సరుకులు అందజేస్తాం. కూరగాయలు, వంటనూనెలు వంటివి బాధితులకు అందజేస్తాం. విజయవాడ, గుంటూరు జిల్లాలో క్రౌడ్ బరస్ట్ అయిందని తెలిపారు సీఎం చంద్రబాబు. వర్షాల కారణంగా 9 మంది మరణించడం చాలా బాధకరమన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఈ వరదలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version