వర్షంలో ప్రయాణించిన తండ్రి, కూతురు.. క్షణాల్లో మాయం..!

-

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు బ్రిడ్జి పై ఉదయం కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కూతుర్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు వరద ప్రవాహంలో కొట్టుకపోయింది కారు. అయితే ఆ  కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు.

పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి పోయింది కారు. తమ కారు వాగులోకి పోయిందని, మా మెడవరకు నీరు వచ్చిందంటూ బందువులకు పోన్ లు చేసిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని. ప్రస్తుతం వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావడం.. కారు కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు  కుటుంబసభ్యులు, బందువులు. తాజాగా కొట్టుకుపోయిన మహిళ అశ్వని మృతదేహం లభ్యం అయింది. కారు ఆచూకి కూడా లభించింది. ఒక్క క్షణం ఆలోచించి ప్రయాణం చేసుంటే వారి ప్రాణాలు పోయేవి కాదని స్థానికులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version