స్క్రిప్ట్ చదవడం తప్ప జీవోలు చదవడం రాదా? – బాలయ్యపై రోజా సీరియస్‌

-

నందమూరి బాలకృష్ణ పై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జీవో నెంబర్ 1 గురించి పూర్తిగా చదివితే అర్థమవుతుందన్నారు. ఆయన ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు నుంచి బాలకృష్ణ బయటకు రావాలని రోజా పిలుపునిచ్చారు.

ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప జీవోలు చదవడం రాదా? అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 1 ఎందుకు తెచ్చారో తెలుసుకున్నారా? అని నిలదీశారు. బాలకృష్ణ రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని, ఆ జీవో నెంబర్ ఎందుకు తెచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్స్ వెనక్కు తీసుకుంటారని రోజా అన్నారు. సినిమాలో ఎన్ని డైలాగులు కొట్టిన చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version