అల్లర్లకు కారణం జనసేన, టీడీపీనే: సజ్జల

-

కోనసీమ అల్లర్లు పక్కా పథకం ప్రకారమే జరిగాయని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విపక్షాల  మాటలు చూస్తే ఇదే అర్థం అవుతుందని అన్నారు. మా ఇళ్లను మేమే కాల్చేసుకుంటామా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆర్కెస్ట్రా పవన్ కళ్యాణ్, బీజేపీలో ఉండే చంద్రబాబు ఏజెంట్లు బుద్ది ఉండే విమర్శిస్తున్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాల మాటలు చూస్తుంటే కథంతా వాళ్లే నడిపించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. జనసేన తరుపున పోటీ చేసిన వ్యక్తి కూడా అల్లర్లలో పాలు పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పా..? రైటా..? అనేదానిపై మీ నిర్ణయాన్ని స్పష్టం తెలపాలని డిమాండ్ చేశారు. రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని.. తెలుగు దేశం, జనసేనకు సంబంధించిన వారే అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్పీతో పాటు చాలా మంది పోలీసులు గాయపడ్డారని అన్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా నిగ్రహంతో ఉన్నారని.. పరిస్థితులు అదుపు తప్పాలని పవన్ కళ్యాన్, చంద్రబాబు కోరుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version