రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెరుగుతాయి : సీఎం జగన్

-

 రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయి. కుటుంబాలను అడ్గగోలుగా చీలుస్తారు. రాజకీయాలను కూడా చీలుస్తారు.రాజకీయాల్లో మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు కూడా ఇస్తామని నేతలు వస్తారు. పొత్తుల కోసం కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతారు అని కాకినాడ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్య చేశారు.

సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాకినాడలో వైఎస్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో పేదలకు మేలు జరిగిందా..? ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందా ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు హయాంలో రైతు భరోసా.. వైఎస్సార్ ఆసరా వంటివి ఏమి లేవు. మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కడే. మరోవైపు టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరయ్యారు. వారిని సీఎం జగన్ బుజ్జగించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version