5 ఏళ్లు బీజేపీతో జగన్‌ అక్రమ సంబంధం – వైఎస్‌ షర్మిల సంచలనం

-

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు వైఎస్‌ షర్మిల. ఢిల్లీలో జగన్‌ చేసిన ధర్నాపై వైఎస్‌ షర్మిల చురకలు అంటించారు. ఢిల్లీలో జగన్ చేసింది ధర్నా కాదు…కపట నాటకం అన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్న జగన్ మాటలను షర్మిల గుర్తి చేసారు. జగన్‌ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? అంటూ నిలదీశారు షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? అంటూ ఆగ్రహించారు.


వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అంటూ ఫైర్‌ అయ్యారు షర్మిల. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేశారని గుర్తు చేశారు షర్మిల. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? అంటూ నిప్పులు చెరిగారు షర్మిలమ్మ.  YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే జగన్ నుంచి సంఘీభావం రాలేదు అంటూ ఆగ్రహించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version